
భారత్ వేదిక గానే తొలి ఐసీసీ మహిళ లఛాంపియన్స్ట్రోఫీ.. ప్రారంభ తేదీ,
Womens Champions Trophy : మొట్ట మొదటి ఐసీసీ మహిళల ఛాంపియన్స్ ట్రోఫీకి భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ విషయాన్ని ఐసీసీ వెల్లడించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 14 నుంచి 28 వరకు ఈ టోర్నీ జరగనుంది. ఆరు జట్లు ఈ టోర్నీలో పాల్గొంటాయని తెలిపింది. ఈ టోర్నమెంట్ తొలి ఎడిషన్లోని అన్ని మ్యాచ్లు ముంబైలోని క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా, వడోదరలోని వడోదర అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరగనున్నాయి. వాస్తవానికి ఈ టోర్నీ శ్రీలంకలో జరగాల్సి ఉంది. శ్రీలంక క్రికెట్ బోర్డు పరిపాలన వ్యవహారాల్లో ఆ దేశ ప్రభుత్వం జోక్యం చేసుకుంటుందన్న కారణంగా ఐసీసీ ఆతిథ్య హక్కుల నుంచి శ్రీలంకను తప్పించింది. A new chapter in women's cricket is waiting to be written 🤩 The dates and venues for the inaugural Women's Champions Trophy in 2027 are locked in 🔒 — ICC (@ICC) September 2, 2026 ఇక ఈ టోర్నమెంట్కు ఆతిథ్యం ఇవ్వడానికి బంగ్లాదేశ్, భారత్, దక్షిణాఫ్రికా అభ్యర్థులను ఐసీసీ తన నిర్ధారిత ఆతిథ్య మూల్యాంకన ప్రమాణాల ప్రకారం అంచనా వేసి, ప్రత్యామ్నాయ ఆతిథ్య దేశంగా భారత్ను సిఫార్సు చేసింది. ఈ నిర్ణయాన్ని సెప్టెంబర్ 1న ఐసీసీ బోర్డు ఆమోదించింది. మహిళల ఛాంపియన్స్ ట్రోఫీ 2027 మహిళల క్రికెట్కు ఒక ఉత్తేజకరమైన కొత్త అధ్యాయాన్ని సూచిస్తుంది అని ఐసిసి ఛైర్మన్ జై షా అన్నారు. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, భారత్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక జట్లు ఈ టోర్నమెంట్లో పాల్గొననున్నాయి. టీ20 ఫార్మాట్లో ఈ మెగాటోర్నీని నిర్వహించనున్నారు. ఈ ఆరు జట్లు రౌండ్-రాబిన్ లీగ్ పద్ధతిలో పోటీ పడనున్నాయి. అగ్రస్థానంలో నిలిచిన రెండు జట్లు ఫిబ్రవరి 28న జరిగే ఫైనల్లో తలపడనున్నాయి